పీలేరులో Tdpకి షాక్.. Ycpలో చేరిన కీలక నేత

by Disha Web Desk 16 |
పీలేరులో Tdpకి షాక్.. Ycpలో చేరిన కీలక నేత
X

దిశ, డైనమిక్ బ్యూరో : అన్నమయ్య జిల్లా పీలేరులో టీడీపీకి షాక్ తగిలింది. మాజీ ఎమ్మెల్యే జీవీ శ్రీనాథ్ రెడ్డి టీడీపీకి గుడ్ బై చెప్పేసి వైసీపీ గూటికి చేరారు. తాడేపల్లి సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సమక్షంలో మాజీ ఎమ్మెల్యే జీవీ శ్రీనాధ్‌ రెడ్డి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. మాజీ ఎమ్మెల్యేకు వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ కండువా వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.


మాజీ ఎమ్మెల్యే శ్రీనాధ్‌‌రెడ్డితో పాటు జీవీ రాకేశ్‌రెడ్డి, వెంకట కృష్ణారెడ్డి, వి.ఉమాకాంత్‌ రెడ్డి, నరేందర్‌ రెడ్డి, నరేష్‌కుమార్‌ రెడ్డిలు చేరారు. ఈ కార్యక్రమంలో రాజంపేట పార్లమెంట్ సభ్యులు మిథున్‌ రెడ్డి, పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, మైనారిటీ కమిషన్‌ చైర్మన్‌ ఇక్భాల్‌ అహ్మద్‌ ఖాన్‌ పాల్గొన్నారు.

READ MORE

తపస్వి అంతిమ యాత్రలో Varla Ramaiah



Next Story

Most Viewed